తెలంగాణ, నల్గొండ. 30 జూన్ (హి.స.)
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ తెలిపారు. సోమవారం దేవరకొండ మండలంలోని గన్యానాయక్ తండాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాల సొంతింటి కల నెరవేరాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ విద్యా, వైద్యంపై చిత్తశుద్ధితో పని చేస్తుందని చెప్పారు. అలాగే రూ.5 లక్షలు ఉన్న ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ. 10 లక్షలకు పెంచి పేద ప్రజల వైద్యానికి తోడ్పాటును అందిస్తున్నట్లు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు