అమరావతి, 7 జూన్ (హి.స.)ఏపీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయి. ఫస్టియర్లో 1,35,826 మంది పరీక్ష రాయగా.. సెకండియర్లో 97,963 మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. టీవీ9 తెలుగు వెబ్సైట్ ద్వారా పరీక్షా ఫలితాలను వేగంగా చూడవచ్చు. రిజల్ట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్సైట్, టీవీ9 తెలుగు వెబ్సైట్లో విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్ను నమోదు చేసి మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనమిత్ర వాట్సప్ గ్రూప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు క్షణాల్లో తనిఖీ చేసుకోవచ్చు.
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలను ఇంటర్లో ఫెయిలైన విద్యార్ధులతోపాటు సబ్జెక్టుల్లో తమ స్కోర్ను మెరుగుపరచుకోవాలని భావించే విద్యార్ధులు కూడా రాశారు. ఇక పరీక్షలు పూర్తయి దాదాపు నెల రోజులు గడుస్తున్నందున వేలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ల నిరీక్షణకు శనివారం తెరపడనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి