కాచిగూడ రైల్వే స్టేషన్ ముఖ ద్వార విద్యుత్ దీపాలంకరణను జాతికి అంకితం చేయనున్న గౌరవ కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి
హైదరాబాద్, 7 జూన్ (హి.స.) గౌరవ కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, కాచిగూడ రైల్వే స్టేషన్‌లో జూన్ 09, 2025 న కాచిగూడ రైల్వే స్టేషన్ ముఖ ద్వార విద్యుత్ దీపాలంకరణను జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమంలో ఇతర ప్రముఖులు, ప్రజా ప
కాచిగూడ రైల్వే స్టేషన్ ముఖ ద్వార విద్యుత్ దీపాలంకరణను జాతికి అంకితం చేయనున్న గౌరవ కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి


హైదరాబాద్, 7 జూన్ (హి.స.)

గౌరవ కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, కాచిగూడ రైల్వే స్టేషన్‌లో జూన్ 09, 2025 న కాచిగూడ రైల్వే స్టేషన్ ముఖ ద్వార విద్యుత్ దీపాలంకరణను జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమంలో ఇతర ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. వీరితోపాటు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ మరియు ఇతర సీనియర్ రైల్వే అధికారులు కూడా హాజరవుతారు.

నగరంలోని ఎక్కువ మంది రైలు వినియోగదారులకు సేవలను అందిస్తున్న కాచిగూడ రైల్వే స్టేషన్ హైదరాబాద్ జంట నగరాల్లోని ప్రధాన టెర్మినల్స్‌లో ఒకటి. ఇది హైదరాబాద్ డివిజన్‌లోని ఒక ముఖ్యమైన స్టేషన్ మరియు 5 ప్లాట్‌ఫారమ్‌లను కలిగి ఉంది. ఇందులో ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలు కల్పించబడ్డాయి. ఈ స్టేషన్ రోజుకు సగటున 103 రైళ్లు మరియు సగటున 45,000 మంది ప్రయాణికులకు సేవలను అందిస్తూ ఇప్పటివరకు లక్షలాది మంది రైలు వినియోగదారులకు ఉత్తమ అనుభవాన్ని అందించడంలో 100 కంటే ఎక్కువ ఫలప్రధమైన సంవత్సరాలను పూర్తి చేసుకుంది.

పర్యాటక అనుకూల కార్యక్రమాలలో భాగంగా, కాచిగూడ రైల్వే స్టేషన్ ముఖద్వారాన్నివిద్యుత్ దీపాలంకరణను రూ. 2.23 కోట్ల అంచనా వ్యయంతో ప్రకాశవంతం చేయాలనే ప్రతిపాదనను పర్యాటక మంత్రిత్వ శాఖ ఆమోదించగా సదరు పనిని దక్షిణ మధ్య రైల్వేలోని హైదరాబాద్ డివిజన్ అమలుచేసింది. ఈ కార్యక్రమం నిర్మాణ సౌందర్యాన్ని సృష్టించడం, ఇండో-సార్సెనిక్/ఇండో గోతిక్ నిర్మాణ శైలిని మరియు దాని గొప్ప వారసత్వాన్ని సరైన ప్రకాశంతో హైలైట్ చేయడం ప్రధాన లక్ష్యం. ఈ అలంకరణలో వివిధ రంగుల నేపధ్యాలను ఉపయోగించి దీపాలను అలంకరించడం వలన స్థానిక/జాతీయ/అంతర్జాతీయ సందర్భాలు మరియు కార్యక్రమాల ఉత్సాహం పెరుగుతుంది. ఇది ప్రయాణీకులకు, ప్రజలకు మరియు పర్యాటకులకు రాత్రిపూట దృశ్యమానమైన వాతావరణాన్ని అందిస్తుంది.

ఈ అలంకరణలో విద్యుత్ పరికరాలు అవుట్‌డోర్ టైప్ ఆర్.జి.బి. , ఎల్.ఈ.డి, ఐ.పి 66 వంటి తాజా ఆధునిక పరికరాలతో తయారు చేయబడ్డాయి. అందువలన ఇవి వివిధ లైటింగ్ పథకాలకు అనువైన 512 డి.ఎం.ఎక్స్ కంట్రోల్ సిస్టమ్ & సెకండరీ ఆప్టిక్స్‌కు మద్దతు ఇచ్చే అంతర్నిర్మిత డి.ఎం.ఎక్స్ డీకోడర్‌తో ఐ. పి 66 రేట్ చేయబడ్డాయి. లైటింగ్ పర్యావరణపరంగా సురక్షితమైనది మరియు కాంతి కాలుష్య రహితం .

లూమినైర్‌లు & ఎలక్ట్రికల్ ఉపకరణాలు సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా నిర్మాణాత్మకంగా సురక్షితమైన మౌంటు ఏర్పాట్లు చేయబడినాయి. అధిక సర్జ్ వోల్టేజ్‌ల నుండి నిరోధించడానికి బహుళ ప్రదేశాలలో తగిన రేటింగ్ & అంకితమైన రాగి ప్లేట్ ఎర్తింగ్‌తో కూడిన సర్జ్ ప్రొటెక్షన్ పరికరం అందించబడింది. మొత్తం వ్యవస్థ యొక్క రక్షణ, భద్రత మరియు శక్తి సామర్థ్యంపై కీలక దృష్టితో స్టేషన్ యొక్క వారసత్వ నిర్మాణాన్ని మెరుగైన ప్రకాశంతో అలంకరించడం ఈ విద్యుత్ దీపాలంకరణ లక్ష్యం.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande