హైదరాబాద్, 7 జూన్ (హి.స.)
ముస్లిం సోదరులకు గవర్నర్ జిష్ణుదేవ్
వర్మ, సీఎం రేవంత్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ఉల్ అజ్ పండుగ త్యాగ స్ఫూర్తిని, అత్యున్నత భక్తిని సూచిస్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. భాగస్వామ్యం, దానధర్మం, గౌరవం, అవసరమైన వారికి సాయం చేయడం ఈ పండుగ ఉద్దేశాలని పేర్కొన్నారు. శాంతి, ఐక్యతకు బక్రీద్ ప్రతీక అని చెప్పారు.
త్యాగానికి బక్రీద్ ప్రతీక అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని సందేశాన్ని ఇస్తుందని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..