వైనతేయ నది తీరం.లో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత.బాలబాలాజీ స్వామి కళ్యాణోత్సవం
అమరావతి, 7 జూన్ (హి.స.) మామిడికుదురు, పవిత్ర వైనతేయ నదీ తీరంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా వెలసిన అప్పనపల్లి బాలబాలాజీస్వామి కల్యాణోత్సవం శుక్రవారం రాత్రి 9.15 గంటలకు నేత్రపర్వంగా జరిగింది. సుముహూర్త సమయంలో వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు మిన్నంటగా,
వైనతేయ నది తీరం.లో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత.బాలబాలాజీ స్వామి కళ్యాణోత్సవం


అమరావతి, 7 జూన్ (హి.స.)

మామిడికుదురు, పవిత్ర వైనతేయ నదీ తీరంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా వెలసిన అప్పనపల్లి బాలబాలాజీస్వామి కల్యాణోత్సవం శుక్రవారం రాత్రి 9.15 గంటలకు నేత్రపర్వంగా జరిగింది. సుముహూర్త సమయంలో వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు మిన్నంటగా, గోవింద నామస్మరణలు చేస్తున్న భక్తుల ఆధ్యాత్మిక కోలాహలం నడుమ కల్యాణ క్రతువు రమణీయంగా సాగింది. వేదపండితులు చలమచర్ల మురళీకృష్ణమాచార్యులు, వేణుగోపాలాచార్యులు, గొడవర్తి శ్రీనివాస్‌లు ముహూర్త సమయాన జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉత్సవమూర్తుల శిరస్సులపై ఉంచడం, మాంగల్యధారణ, తలంబ్రాల ఘట్టాలను భక్తులు వీక్షించారు. కల్యాణోత్సవానికి సకల దేవతాగణాన్ని ఆహ్వానిస్తూ తొలుత గరుడ ధ్వజపటాన్ని ఎగురవేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై కొలువుదీర్చి వాయిద్యాలు, కోలాట భజన కీర్తనలతో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీవేమా, జడ్పీ మాజీ ఛైర్మన్‌ నామన రాంబాబు, ఏఎంసీ ఛైర్మన్‌ పెనుమాల లక్ష్మి, ఎంపీపీ కుసుమ వనజకుమారి, కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్, సీఐ భీమరాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆలయ ఏసీ ఎం.సత్యనారాయణరాజు, ఉత్సవ కమిటీ సభ్యులు ఊరేగింపులో పాల్గొన్నారు. పలు దేవస్థానాల నుంచి వచ్చిన పట్టువస్త్రాలను స్వామి, అమ్మవార్లకు సమర్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande