విద్యుత్ వినియోగం పెరిగింది.. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి పెంచాలి.. డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, 7 జూన్ (హి.స.) తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఏపీలోని కర్నూలులో గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ చూశాను అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ వినియోగం పెరిగింది.. థర్మల్ విద్యుత్ ఖర్చు, కాలుష్యం కూడా పెరిగిం
బట్టి


హైదరాబాద్, 7 జూన్ (హి.స.) తెలంగాణ ప్రభుత్వం నుంచి

ప్రత్యేకంగా ఏపీలోని కర్నూలులో గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ చూశాను అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ వినియోగం పెరిగింది.. థర్మల్ విద్యుత్ ఖర్చు, కాలుష్యం కూడా పెరిగింది.. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి పెంచాల్సి ఉందని పేర్కొన్నారు. సోలార్, విండ్, మౌంటెడ్ సోలార్, పంప్ స్టోరేజీ విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి.. 2025 న్యూ ఎంఎర్జీ పాలసీ తెచ్చాం.. సింగరేణిలో బొగ్గు ద్వారా 20 వేల మెగావాట్ల విద్యుత్ తెలంగాణలో ఉత్పత్తి చేయాలనుకుంటున్నాం అని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.

ఇక, గ్రీన్ కో యాజమాన్యం ప్లాంట్ చూడమని ఆహ్వానించింది అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి అన్నారు. లక్ష కోట్ల పెట్టుబడికి తెలంగాణలో వివిధ సంస్థలతో ఎంఓయూలు జరిగాయి.. కర్నూలు వద్ద గ్రీన్ కో అండ్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి నాంది పలికింది.. సోలార్ పవర్ సూర్యాస్తమయం తరువాత ఉత్పత్తికి అవకాశం లేదన్నారు. ఉదయం ఉత్పత్తి అయ్యే సోలార్ పవర్ తో వాటర్ పంప్ చేసి రాత్రి అదే నీటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.. 1680 మెగావ్వాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.. గ్రీన్ కో కంపెనీని అభినందిస్తున్నా.. ఇలా చేయడం ప్రపంచంలో మొదటిదని చెప్పుకొచ్చారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande