హైదరాబాద్, 7 జూన్ (హి.స.)
హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ లో నేటి ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పార్క్ చేసిన అంబులెన్సు లో మంటలు చెలరేగడంతో అంతటా వ్యాపించాయి. మంటలను గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది వెంటనే పైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాసేపు ఏఐజీ ఆస్పత్రి దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. మంటలు చెలరేగడంతో ఆస్పత్రిలోని రోగులు ఆందోళనకు గురయ్యారు. వేలాది మంది రోగులకు ప్రమాదం తప్పడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్