ప్రభుత్వం 78 కోట్లతో గండికోట.అభివృద్ధి చేయనుంది
అమరావతి, 7 జూన్ (హి.స.)సాహసికుల స్వర్గధామం.. పర్యాటకుల కలల స్వప్నం.. గండికోట ప్రాంతం. గ్రాండ్‌ కేనియన్‌ ఆఫ్‌ ఇండియాగా పిలుచుకునే పెన్నా లోయలోని రాతి వనానికి విజయనగర సామ్రాజ్యం నగిషీలు చెక్కింది. దీంతో చరిత్రకారులనూ తనవైపు తిప్పుకొంటోంది. ఇంతటి అందమైన
ప్రభుత్వం 78 కోట్లతో గండికోట.అభివృద్ధి చేయనుంది


అమరావతి, 7 జూన్ (హి.స.)సాహసికుల స్వర్గధామం.. పర్యాటకుల కలల స్వప్నం.. గండికోట ప్రాంతం. గ్రాండ్‌ కేనియన్‌ ఆఫ్‌ ఇండియాగా పిలుచుకునే పెన్నా లోయలోని రాతి వనానికి విజయనగర సామ్రాజ్యం నగిషీలు చెక్కింది. దీంతో చరిత్రకారులనూ తనవైపు తిప్పుకొంటోంది. ఇంతటి అందమైన, చారిత్రక సంపదకు వన్నె తేవాలని కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. కేంద్రం సాయంతో రూ.78 కోట్లతో అభివృద్ధి చేయాలని చూస్తోంది. విద్యుద్దీకరణ, నడకదారులు, బోటు షికారు, కయాకింగ్‌తోపాటు వసతి సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలని ప్రణాళికలు వేసింది. ఇవన్నీ అమలైతే పెన్నా ఒడ్డున ఎత్తయిన ఎర్రటిరాళ్లపై రాత్రి వేళల్లో టెంట్లు వేసుకొని చల్లటి వెన్నెలను ఆస్వాదించొచ్చు.

పెన్నా ప్రవాహంతో పోటీపడి కయాకింగ్‌ చేయొచ్చు. జీవకళతో ఉట్టిపడే అక్కడి శిల్పాలను చూడొచ్చు. మరోవైపు త్వరలో సీప్లేన్‌ సదుపాయమూ సమకూరనుంది. అసలు.. ఈ పనులన్నీ గత తెదేపా ప్రభుత్వమే చేపట్టింది. కానీ, వైకాపా పాలకులు వాటిని పక్కనపెట్టేశారు. ఇప్పుడు కూటమి పాలకులు మళ్లీ పట్టాలెక్కిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande