అమరావతి, 7 జూన్ (హి.స.)
మరో దిగ్గజ సంస్థ వచ్చేస్తోంది. రాజధాని అమరావతికి ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ ( రానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నతస్థాయిలో గతంలోనే గూగుల్ ప్రతినిధులు చర్చ నిర్వహించారు. ఇందులో భాగంగా అనంతవరం, నెక్కల్లు మధ్య సమీపంలోని ఈ-8 రోడ్డు పక్కన సర్వే నంబర్లు 10, 12, 13, 15, 16 లో సుమారు 143 ఎకరాల భూమిని గూగుల్కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ స్థలాన్ని గూగుల్కు కేటాయించేందుకు సీఆర్డీఏ ముందుకు వచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ