తిరుమలలో నిరంతరం భక్తుల.రద్దీ ఎక్కువగానే ఉంది
అమరావతి, 7 జూన్ (హి.స.) తిరుపతి, జూన్ 7: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో ) నిరంతరం భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఇక వారాంతాలు, సెలవుల్లో అయితే ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తిరుమలకు వస్తుంటారు.
తిరుమలలో నిరంతరం భక్తుల.రద్దీ ఎక్కువగానే ఉంది


అమరావతి, 7 జూన్ (హి.స.)

తిరుపతి, జూన్ 7: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో ) నిరంతరం భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఇక వారాంతాలు, సెలవుల్లో అయితే ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఇప్పుడు మరో వారంలో స్కూళ్లకు సెలవులు ముగియనున్నాయి. దీంతో చాలా మంది శ్రీనివాసున్ని దర్శించుకునేందుకు తిరుమల బాటపట్టారు. దీంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. వారాంతపు సెలువు, స్కూళ్ల రీఓపెన్ ఉండటంతో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. దీంతో అలిపిరి టోల్ గేట్‌ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande