హైదరాబాద్, 7 జూన్ (హి.స.)
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఏఐజి దవాఖానలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. శనివారం ఉదయం అమెరికా పర్యటనను ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్.. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, పార్టీ నాయకులతో కలిసి గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు వెళ్లారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్న పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. త్వరలోనే మాగంటి గోపీనాథ్ కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..