కాపు ఉద్యమనేత ముద్రగడకు తీవ్ర అనారోగ్యం.. కూతురి ఆవేదన
అమరావతి, 7 జూన్ (హి.స.)కాపు ఉద్యమ నేత, మాజీ ఎంపీ, వైఎస్ఆర్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు క్యాన్సర్ సోకినట్లు ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి వెల్లడించారు. ఈ విషయం సోషల్ మీడియా వేదిక ద్వారా తె
కాపు ఉద్యమనేత ముద్రగడకు తీవ్ర అనారోగ్యం.. కూతురి ఆవేదన


అమరావతి, 7 జూన్ (హి.స.)కాపు ఉద్యమ నేత, మాజీ ఎంపీ, వైఎస్ఆర్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు క్యాన్సర్ సోకినట్లు ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి వెల్లడించారు. ఈ విషయం సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేస్తూ క్రాంతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

క్రాంతి తెలిపిన వివరాల ప్రకారం, ముద్రగడ పద్మనాభం క్యాన్సర్‌తో పోరాడుతున్నప్పటికీ, ఆయనకు సరైన చికిత్స అందడం లేదని ఆమె ఆరోపించారు. తన సోదరుడు గిరి ఉద్దేశపూర్వకంగా తండ్రికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించడం లేదని, తనను కూడా తండ్రిని కలవనీయకుండా అడ్డుకుంటున్నాడని క్రాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మాజీ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తనను తండ్రి వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ, గిరి, అతని అల్లుడు అడ్డుకున్నారని ఆమె తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande