తెలంగాణ, కరీంనగర్. 7 జూన్ (హి.స.)
పేదలందరికీ పక్కా ఇండ్లు ఉండాలని సంకల్పంతో నాడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని.. ఆమెను ఆదర్శంగా తీసుకొని నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతీ పేదవారికి ఇల్లు ఉండాలనే సంకల్పంతో ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నామని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్ లో తిమ్మాపూర్ మండలంలోని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని, ఏ పథకం ఇచ్చినా మహిళలకు మెజారిటీగా ఇస్తున్నామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు