తెలంగాణ, మేడ్చల్ మల్కాజ్గిరి. 7 జూన్ (హి.స.)
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సమీపంలోని ఏదులాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అదుపు తప్పిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
బాధితులు మాదాపూర్ లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారని, మాధారంలో ఓ విందుకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులను కుంట్లూరుకు చెందిన భార్గవ్, సైనిక్ పురి కి చెందిన వర్షిత్ గా గుర్తించామన్నారు. ప్రమాదంలో ప్రవీణ్ యాదవ్, దినేశ్ గాయపడ్డారని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు