అమరావతి, 7 జూన్ (హి.స.)వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ బక్రీద్ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
ముస్లిం సోదర, సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ, త్యాగానికి, విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు ప్రతీకగా నిలిచే బ్రకీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అని జగన్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా శనివారం ట్వీట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి