హజ్రత్ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీక బక్రీద్.. ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
అమరావతి, 7 జూన్ (హి.స.)ఈద్ ఉల్-అధా (బక్రీద్) సందర్భంగా రాష్ట్రంలోని ముస్లింలకు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడిమా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. హజ్రత్ ఇబ్రహీం త్యాగనిరతిక
akrid-symbolizes-the-sacrifice-of-hazrat-ibrahim-cm-chandrababu-wish


అమరావతి, 7 జూన్ (హి.స.)ఈద్ ఉల్-అధా (బక్రీద్) సందర్భంగా రాష్ట్రంలోని ముస్లింలకు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఆయన సోషల్ మీడిమా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. హజ్రత్ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా నిర్వహించుకునే బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ‘ఈద్ ముబారక్’ తెలిపారు. త్యాగ బుద్ధిని, నిజమైన భక్తిప్రపత్తులు కలిగి ఉన్నవారే దైవ కృపకు పాత్రులు అవుతారని అన్నారు. అదే సూక్తిని బక్రీద్ (Bakrid) మనకు తెలియజేస్తోందని పేర్కొన్నారు.

నేటి ఆధునిక కాలంలో సాటి మనిషిని ప్రేమించే వారే నిజమైన దైవ భక్తులుగా చెప్పవచ్చని అన్నారు. హజ్రత్ ఇబ్రహీం స్ఫూర్తిగా అందరూ సాటి వారిని ఆదరిస్తూ సహృదయంతో ముందుకు సాగాలని ‘బక్రీద్’ సందర్భంగా కోరుకుంటున్నా అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande