శ్రీశైలాం, 7 జూన్ (హి.స.)తుంగభద్ర (Tungabhadra) ఎగువన కురిసిన భారీ వర్షాల (Heavy rains) కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఆ వరద నీరు తుంగభద్ర జలాశయానికి కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది.
శనివారం ఉదయానికి ఇన్ ఫ్లో 8,692 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 362 క్యూసెక్కులుగా ఉంది. తుంగభద్ర డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా.. కంటిన్యూగా వస్తున్న వరదతో 1600.66 అడుగులకు చేరుకుంది. ఈ వరద ఇలానే కొనసాగితే మరో రెండు రోజుల్లో డ్యామ్ పూర్తిగా నిండిపోయి.. గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచానా వేస్తున్నారు.
ఇదిలా ఉంటా గత రెండు వారాలుగా శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservoir) కొనసాగిన వరద.. ఈ రోజు పూర్తిగా నిలిచిపోయింది. వర్షాలు తగ్గుముఖం పట్టడం, జూరాల గేట్లను క్లోజ్ చేయడంతో ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఎటువంటి వరద రావట్లేదని అధికారులు ప్రకటించారు. దీంతో ఇంజినీర్ల బృందం చేస్తున్న మరమ్మత్తులకు అనుకూలంగా ఉండటంతో అధికారులు వేగంగా పనులు చేపడుతున్నట్లు తెలుస్తుంది. కాగా వరుసగా వచ్చిన వరద కారణంగా శ్రీశైలం జలాశయంలో 885 అడుగులకు గాను ప్రస్తుతం 836.40 అడుగుల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి