హైదరాబాద్, 7 జూన్ (హి.స.)
బిహార్ మాజీ ముఖ్యమంత్రి
లాలూ ప్రసాద్ యాదవ్ కు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కాళేశ్వరం అవినీతి నుంచి కేసీఆర్ కుటుంబాన్ని బయటపడేసే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం నిర్మాణం అంతా కేసీఆర్ ఇష్టానుసారమే జరిగిందని, కేసీఆర్ రాజీనామా చేయాలని గతంలో ఆరోపించిన ఈటల రాజేందర్ ఇప్పుడు మేడిగడ్డ నిర్మాణం మంత్రివర్గం నిర్ణయం ప్రకారమే జరగిందని ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు. ఇవాళ హైదరాబాద్ లో సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆది శ్రీనివాస్.. బీజేపీ నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్