తిరుమల , 7 జూన్ (హి.స.)తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam)లో గత 10 రోజులుగా భక్తుల రద్దీ (Crowd of devotees) కొనసాగుతోంది.
ఈ రోజు వీకెండ్ (Weekend) కావడంతో మరోసారి భక్తులు పోటెత్తారు. శనివారం ఉదయం స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయి.. శిలాతోరణ వరకు చేరుకున్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
వేసవి సెలవులు ముగుస్తుండటం, వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వేలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల పాటు భక్తుల రద్ధీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. శుక్రవారం రోజు స్వామివారిని ఏకంగా 72,174 దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.88 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. అయితే ఇటీవల కాలంలో మెట్ల మార్గం, రోడ్డు మార్గాల్లో పులుల సంచారం ఎక్కువ కావడంతో టీటీడీ, ఫారెస్ట్, పోలీస్ యంత్రాంగాలు భక్తులు రక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి