ఉపాధ్యాయుల ఆందోళనబాట
అమరావతి, 8 జూన్ (హి.స.)ఎస్జీటీలకు మాన్యువల్​కౌన్సెలింగ్​(Counseling) నిర్వహించాలని డిమాండ్​చేస్తూ ఏపీలో ఉపాధ్యాయులు మెరుపుసమ్మెకు (agitation) దిగారు.ఈ రోజు ఏపీలోని అన్ని డీఈవో కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డీఈవ
ఉపాధ్యాయుల ఆందోళనబాట


అమరావతి, 8 జూన్ (హి.స.)ఎస్జీటీలకు మాన్యువల్​కౌన్సెలింగ్​(Counseling) నిర్వహించాలని డిమాండ్​చేస్తూ ఏపీలో ఉపాధ్యాయులు మెరుపుసమ్మెకు (agitation) దిగారు.ఈ రోజు ఏపీలోని అన్ని డీఈవో కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డీఈవో కార్యాలయం ను ముట్టడించారు. వెబ్ కౌన్సెలింగ్ వద్దు మాన్యువల్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. విశాఖ డీఈవో కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎస్​జీటీ (SGT) ఉపా ధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు నిర్వహిస్తామని పాఠశాల విద్యా కార్యదర్శి సమక్షంలో ఇచ్చిన హామీకి భిన్నంగా వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో వెబ్ ఆప్షన్స్ పెట్టకుండా బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చింది. ఆదివారం ఉమ్మడి జిల్లాల డీఈవొ కార్యాలయాల ముట్టడికి సిద్ధం అయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande