ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుంది.. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
పరకాల, 8 జూన్ (హి.స.) ఆదివారం పరకాల పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ళ భూమి పూజ కార్యక్రమంలో పరకాల రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి, ఇంటినిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ కాపీలను అందజ
ఎమ్మెల్యే రేవూరి


పరకాల, 8 జూన్ (హి.స.)

ఆదివారం పరకాల పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ళ భూమి పూజ కార్యక్రమంలో పరకాల రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి, ఇంటినిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ కాపీలను అందజేసిన ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ,అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తామని అన్నారు.

పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. లబ్ధిదారులకు విడుదలవారీగా రూ 5లక్షలు అందజేయడం జరుగుతుందని అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు.ఉచిత ఇసుకను పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులు ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వద్దని, ఎవరైనా తీసుకుంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande