ఇంఫాల్, 8 జూన్ (హి.స.)నిరంతరం ఘర్షణల్లో అట్టుడుకుతున్న మణిపూర్లో మరోసారి నిరసనలు చెలరేగాయి. వాటి అణచివేత కోసం ప్రభుత్వం మరోసారి మణిపూర్లో ఇంటర్నెట్పై నిషేధం విధించింది. తాజాగా మైతేయి నేత అరంబాయి టెంగొల్ అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రంలో అల్లర్లు పెద్ద ఎత్తున మొదలయ్యాయి.
దీంతో 5 జిల్లాల్లో ఐదు రోజుల పాటు వీపీఎన్, వీశాట్ సహా ఇంటర్నెట్, మొబైల్ డేటా వినియోగంపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అల్లర్లకు కేంద్రంగా మారిన ప్రధాన ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్, తౌబాల్, కాక్చింగ్ జిల్లాల్లో సోషల్ మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొట్టేలా, విద్వేష ప్రసంగాలు, ఇతర వీడియో మెసేజ్లను ప్రచారం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అప్రమత్తమైన ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటర్నెట్ నిషేధాన్ని అమలు చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి