న్యూఢిల్లీ :8 జూన్ (హి.స.) ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులో ఇటీవల చేపట్టిన మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించిన భద్రతాదళాల అధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం భేటీ అయ్యారు. ఈ ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించినందుకుగానూ వారిని అభినందించారు. వామపక్ష తీవ్రవాద ముప్పు నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అమిత్ షా ఈ సందర్భంగా పేర్కొన్నారు. త్వరలోనే తాను ఛత్తీస్గఢ్కు వెళ్లి, ఈ ఆపరేషన్లలో ధైర్యసాహసాలతో విధులు నిర్వర్తించిన జవాన్లను కలుస్తానని అమిత్ షా చెప్పారు. ఈ సమావేశంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ, హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు