ఢిల్లీ, 8 జూన్ (హి.స.)గత 11 సంవత్సరాలుగా.. దేశంలో మహిళల హోదా, సాధికారతను దగ్గర నుంచి చూసింది. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మొదలైన ఈ సంక్షేమ చర్యలు.. ఇప్పుడు యావత్ దేశమంతా ఉద్యమంగా, దేశాభివృద్ధి ప్రయాణంలో మహిళలను కేంద్రబిందువుగా ఉంచే విప్లవంగా మారింది. ఈ విధానం మహిళా అభివృద్ధి నుంచి మహిళా నేతృత్వంలోని అభివృద్ధిగా మారింది. మహిళలను లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా, నాయకులుగా, ఆవిష్కర్తలుగా, నిర్ణయాధికారులుగా సాధికారత కల్పిస్తోంది. ఇదిలా ఉంటే మహిళా సాధికారతపై ప్రధాని మోదీ తాజాగా ట్వీట్ చేశారు.
‘గత 11 సంవత్సరాలుగా, ఎన్డీఏ ప్రభుత్వం మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని పునర్నిర్వచించింది. స్వచ్ఛ భారత్ ద్వారా గౌరవాన్ని నిర్ధారించడం నుంచి జన్ధన్ ఖాతాల ద్వారా ఆర్థిక చేరిక వరకు వివిధ కార్యక్రమాలు, మన నారీ శక్తిని శక్తివంతం చేయడంపై దృష్టి సారించాయి. ఉజ్వల యోజన ద్వారా అనేక ఇళ్లకు ఫ్రీ సిలిండర్స్ అందాయి. ముద్రా రుణాలు లక్షలాది మంది మహిళా వ్యవస్థాపకులు తమ కలలను సాకారం చేసుకోవడానికి వీలు కల్పించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి