అమరావతి, 1 జూలై (హి.స.)
శ్రీశైలం(సున్నిపెంట సర్కిల్): శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 58,750 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల నుంచి 1,00085 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. శ్రీశైలం నీటిమట్టం మంగళవారం ఉదయం 6గంటలకు 874.30 అడుగులు, నీటి నిల్వ 160.52 టీఎంసీలుగా నమోదైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ