హైదరాబాద్, 1 జూలై (హి.స.) హైదరాబాద్ నగరంలోని మూసాపేట్ సర్కిల్ పరిధిలోని రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సునీత లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతికి చిక్కింది. ఆస్తి పన్ను చెల్లించే విషయంలో ఓ వినియోగదారుడి నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 80 వేల రూపాయలు డిమాండ్ చేసిన సునీత, దానిలో మొదటగా 30 వేల రూపాయలు తీసుకుంటున్న క్రమంలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్