అమరావతి, 14 జూలై (హి.స.)
గాజుల మండ్యం: తిరుపతి జిల్లా గాజుల మండ్యం పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్రోమో మెడికేర్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ