అమరావతి, 14 జూలై (హి.స.)
అన్నమయ్య జిల్లా: ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బోల్తా పడి తొమ్మిది మంది మృతిచెందారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని రెడ్డిపల్లె చెరువుకట్టపై జరిగింది. ఈ ఘటన ఇవాళ(సోమవారం, జులై14)న ఉదయం చోటుచేసుకుంది. రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్కు మామిడికాయల లోడుతో వెళ్తున్న సమయంలో లారీ అదుపు తప్పి చెరవుకట్టపై బోల్తా పడింది. లారీ బోల్తా పడటంతో 10 మంది కూలీలకు తీవ్రగాయాలు అయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ