జమ్మలమడుగు, 16 జూలై (హి.స.)
,:పర్యాటక కేంద్రంగా ఎంతో ప్రత్యేకత ఉన్న గండికోటలో ఓ బాలిక దారుణ హత్యకు గురైంది. ఓ యువకుడు బైక్పై ఆమెను తీసుకెళ్లి, వచ్చేటప్పుడు ఒక్కడే రావడంతో అతడే చంపేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఉదయం వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి జమ్మలమడుగు పోలీసులు, బాధితుల కథనం ఇలా ఉంది. ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తికి చెందిన పసుపులేటి కొండయ్య, దస్తగిరమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. వీరు పిల్లల చదువులకోసం ప్రొద్దుటూరు గాంధీరోడ్డులోని సార్వకట్ట వీఽధిలో ఉంటున్నారు. వీరి కుమార్తె పసుపులేటి వైష్ణవి (17) ప్రొద్దుటూరులో ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుటోంది. సోమవారం ఉదయం కాలేజీకని ఇంటి నుంచి బయలుదేరింది. బాలిక కాలేజీకి రాలేదని అధ్యాపకులు వైష్ణవి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. వెంటనే వారు కాలేజీకి వెళ్లి వైష్ణవి స్నేహితులను ఆరా తీశారు. గట్టిగా ప్రశ్నించగా.. గండికోటకు వెళ్లిందని కొందరు, కడపకు వెళ్లిందని కొందరు చెప్పారు. కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరులో సాయంత్రం వరకు వెతికి.. ఆచూకీ తెలియకపోవడంతో ప్రొద్దుటూరు వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం గండికోటలోని రంగనాథస్వామి ఆలయం వెనుక భాగంలోని ముళ్లపొదల్లో బాలిక మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు, ప్రొద్దుటూరు డీఎస్పీ భావన, బాధితులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. ఆ మృతదేహం వైష్ణవిదిగా గుర్తించి, జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.క్లూస్ టీం, డాగ్స్క్వాడ్తో తనిఖీలు చేపట్టి కొన్ని ఆధారాలు సేకరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ