హైదరాబాద్, 17 జూలై (హి.స.)
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుగా ఉన్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల పలు బహిరంగ వేదికలపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటచేసుకుంది. తెలంగాణ అభివృద్ధిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కి ఇవాళ లేఖ రాశారు. రాష్ట్రంలో విస్తృతంగా పెట్టుబడులు పెట్టేందుకు కోల్ ఇండియా తో పాటు ఎన్ఎల్సీ ఇండియా సంస్థలు సిద్ధంగా ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. సౌర, పవన్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆ రెండు సంస్థలు ముందుకు వచ్చాయని వివరించారు. అదేవిధంగా పంప్డ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యక్ష్యంగా రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని కిషన్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..