తెలంగాణ, ములుగు. 17 జూలై (హి.స.)
మహిళల ఆర్థిక స్వావలంబన
కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో కార్యాచరణలు అమలు చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అదనపు సీఈఓ సర్ప్పి కట్యాయిని దేవి, జిల్లా కలెక్టర్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. ఇందిరమ్మ కలను సాకారం చేసే దిశగా మహిళా సంఘాలను అన్ని విధాలుగా బలోపేతం చేస్తోంది, అని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు