ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. అక్టోబరు 15 వరకు స్పెషల్ ట్రైన్ల పొడిగింపు
Andhra Pradesh, 17 జూలై (హి.స.) ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నడుపుతోన్న స్పెషల్ ట్రైన్లపై సౌత్ సెంట్రల్ రైల్వేస్ (South Central Railways) కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు మొత్తం 54 ప్రత్యేక రైళ్లను అక్టోబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లుగా త
ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. అక్టోబరు 15 వరకు స్పెషల్ ట్రైన్ల పొడిగింపు


Andhra Pradesh, 17 జూలై (హి.స.)

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నడుపుతోన్న స్పెషల్ ట్రైన్లపై సౌత్ సెంట్రల్ రైల్వేస్ (South Central Railways) కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు మొత్తం 54 ప్రత్యేక రైళ్లను అక్టోబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లుగా తెలిపింది. ఇందులో భాగంగా కాచిగూడ-మధురై మార్గంలో 07191/07192 స్పెఫల్ ట్రైన్లు, హైదరాబాద్‌-కొల్లాం మార్గంలో 07193/07194, హైదరాబాద్‌-కన్యాకుమారి (Hyderabad-Kanyakumari) మార్గంలో 07230/07239 ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు సీపీఆర్వో శ్రీధర్‌ (CPRO Sridhar) తెలిపారు. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మరికొన్ని మార్గాల్లో 38 స్పెషల్ సర్వీసులను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య 10, కాచిగూడ-నాగర్‌సోల్‌ మధ్య 8, నాందేడ్‌-తిరుపతి మధ్య 10, నాందేడ్‌-ధర్మవరం మధ్య 10 ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లుగా ఏర్పాటు చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు.

---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande