హైదరాబాద్, 23 జూలై (హి.స.)
హైదరాబాద్లో 9మంది డ్రగ్స్ పెడ్లర్లు
అరెస్ట్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. నిందితుల వద్ద నుండి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో పలువురు విదేశీయులు సైతం ఉండగా ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉన్నాడు. నిందితుల్లో 7 గురు నైజీరియన్లు కాగా మిగిలిన ఇద్దరిని భారతీయులుగా గుర్తించారు.
వారి వద్ద నుండి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ను అనేక పేర్లతో అమ్ముతున్నట్టు గుర్తించారు. అంతే కాకుండా వారివద్ద నుండి మారణాయుధాలు, 8 మొబైల్ ఫోన్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నింధితులకు ముంబైతో లింకులు ఉన్నట్టు గుర్తించారు. కాటేదాన్ ప్రాంతానికి చెందిన రాజస్థాన్ వాసి జితేందర్ అలియాస్ జిత్తు, మరో వ్యక్తితో కలిసి డ్రగ్స్ అమ్ముతున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. నగరంలో ఈ ముఠా పలువురికి డ్రగ్స్ అమ్ముతున్నట్టు పోలీసులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్