తెలంగాణ, జగిత్యాల. 23 జూలై (హి.స.)
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. సారంగాపూర్ మండలంలోని అర్పపల్లి గ్రామంలో ఎస్సీ, సబ్ ప్లాన్ నిధులు రూ.54 లక్షలు, రేచపల్లి గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.54లక్షలతో అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలు కొత్త రేషన్ కార్డులు మంజూరుతో సన్న బియ్యం లబ్ధి పొందుతున్నారని అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు.
రేవంత్ రెడ్డి రైతు బిడ్డ అని రుణ మాఫీ, రైతు భరోసా తో రైతుల కళ్లలో ఆనందం నింపారాని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు మహిళ సంఘాల ద్వారా రూ.1 లక్ష వరకు రుణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కు ఉచిత ఇసుక పాలసీ అమలు అయ్యే విధంగా అధికారులు చొరవ చూపాలని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు