అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు ఏమాయే?.. ప్ర‌శ్నించిన ఎమ్మెల్యే ధ‌న్ పాల్
తెలంగాణ, నిజామాబాద్. 24 జూలై (హి.స.) గరీబోళ్ల ఇళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఉందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ధ్వజమెత్తారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రి పొంగులేటి ఇచ్చిన హామీ ఏమాయే. సమీక్షలు సమావేశాలకే
ఎమ్మెల్యే ధ‌న్ పాల్


తెలంగాణ, నిజామాబాద్. 24 జూలై (హి.స.)

గరీబోళ్ల ఇళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఉందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ధ్వజమెత్తారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రి పొంగులేటి ఇచ్చిన హామీ ఏమాయే. సమీక్షలు సమావేశాలకే పరిమితమవుతారా అని ప్రశ్నించారు. గతంలో అధికారులతో సమీక్షలు నిర్వహించి గత దసరా పండుగకే ఇస్తామని మాయమాటలు చెప్పిండ్రు… మళ్లీ దసరా వచ్చిన ఇప్పటి వరకు పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అర్బన్ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలనిఎమ్మెల్యే డిమాండ్ చేశారు. వచ్చే దీపావళి పండుగ వరకు నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూమ్ లు పంపిణీ చేయనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరాహార దీక్షలు చేపడుతామని ప్రభుత్వానికి వారు డెడ్ లైన్ ప్రకటించారు.

గురువారం జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande