తెలంగాణ, ఖమ్మం. 24 జూలై (హి.స.)
ఖమ్మం జిల్లా సింగరేణి మండల
కేంద్రంలోని కారేపల్లి తెలంగాణ మోడల్ పాఠశాలను తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా గురువారం సందర్శించారు. ముందుగా పాఠశాల భవనాన్ని, తరగతి గదులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి పాఠశాల ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాల గురించి, మధ్యాహ్న భోజన పథకంపై ఆరా తీశారు.
ఆమె వెంట డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలాస్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) శ్రీజ, డిప్యూటీ డైరెక్టర్లు మదన్ మోహన్ ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు