థాయ్లాండ్, కాంబోడియా ఘర్షణలు తీవ్రం.. భారతీయులకు కీలక అడ్వైజరీ
హైదరాబాద్, 25 జూలై (హి.స.) థాయిలాండ్, కంబోడియా లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. సరిహద్దుల పొడవున అనేక ప్రాంతాల్లో ఇరుదేశాలకు చెందిన సైనికుల మధ్య భీకర ఘర్షణలు చెలరేగాయి . ఈ ఘర్షణలలో ఓ సైనికుడితోపాటు 15 మంది మరణించారు. తాజా ఉద్రిక్తతలతో భారత్ అప్రమత్తమైం
ఇండియన్ ఎంబసీ


హైదరాబాద్, 25 జూలై (హి.స.)

థాయిలాండ్, కంబోడియా లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. సరిహద్దుల పొడవున అనేక ప్రాంతాల్లో ఇరుదేశాలకు చెందిన సైనికుల మధ్య భీకర ఘర్షణలు చెలరేగాయి . ఈ ఘర్షణలలో ఓ సైనికుడితోపాటు 15 మంది మరణించారు. తాజా ఉద్రిక్తతలతో భారత్ అప్రమత్తమైంది. ఈ మేరకు భారతీయుల కోసం థాయ్లాండ్లోని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. భారత పౌరులు థాయ్ లోని ఏడు ప్రావిన్స్లవైపు ప్రయాణించొద్దని సూచించింది. ఉబోన్ రాట్చథాని, సురిన్, సిసాకెట్, బురిరామ్, సా కాయో, చంతబురి, ట్రూట్.. ఈ ఏడు ప్రావిన్స్లకు దూరంగా ఉండాలని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది.

సరిహద్దు పొడవున ఆరు ప్రాంతాలలో ఘర్షణలు జరుగుతున్నట్లు థాయ్ రక్షణ శాఖ ప్రతినిధి సురసంత్ కాంగ్సిరి తెలిపారు. బుధవారం థాయ్లాలో జరిగిన మందుపాతర పేలుడు తాజా ఘర్షణలకు పురిగొల్పింది. ఈ పేలుడులో ఐదుగురు థాయ్ సైనికులు గాయపడ్డారు.ఈ మందుపాతర పేలుడుకు కంబోడియా కారణమని థాయ్ ఆరోపించగా, అది ఏనాటి మందుపాతరో అయి ఉండవచ్చని, దీంతో తమకు సంబంధం లేదని కంబోడియా జవాబిచ్చింది. ఈ నేపథ్యంలో కంబోడియాలోని తన రాయబారిని ఉపసంహరించుకున్న థాయ్ తమ దేశంలోని కంబోడియా రాయబారిని దేశం నుంచి బహిష్కరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande