తిరుమల, 25 జూలై (హి.స.)
వెంకటగిరి ఎమ్మెల్యే కె.రామకృష్ణ తితిదే ఉద్యోగితో వాగ్వాదానికి దిగారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్లో శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్న ఎమ్మెల్యే.. ఆలయం వెలుపలకు వచ్చే సమయంలో మహద్వారం ఎదురుగా ఉన్న గేటు తీయాలని అక్కడ పనిచేస్తున్న ఉద్యోగిని అడిగారు. ఇటుగా ఎవరినీ అనుమతించకూడదని ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయని, అందరూ వెళ్లే మార్గంలో వెళ్లాలని ఉద్యోగి చెప్పారు. దాంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వాగ్వాదానికి దిగారు. ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది సర్దిచెప్పడంతో ఉద్యోగి గేటు తీశారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ