ఒడిశా, 25 జూలై (హి.స.) ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఉన్న జేయ్ పోర్ డిప్యూటీ రేంజర్ రామ చంద్ర నేపాక్ ఇండ్లపై ఇవాళ విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. ఆ తనిఖీల్లో ఆ ఆఫీసర్ ఇంట్లో సుమారు 1.4 కోట్ల నగదు దొరికింది. అతని అపార్ట్మెంట్లోని ఓ రహస్య ట్రెజరీలో ఆ నగదును దాచాడతను. ఫారెస్ట్ ఆఫీసర్ రామచంద్ర నుంచి నగదుతో పాటు నాలుగు బంగారు బిస్కెట్లు, 16 బంగారు నాణాలు రికవరీ చేశారు. మొత్తం ఆరు ప్రదేశాల్లో ఇవాళ ఒడిశా విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులను సంపాదించినట్లు ఆ ఆఫీసర్పై ఆరోపణలు ఉన్నాయి.
విజిలెన్స్ శాఖ స్పెషల్ జడ్జి ఇచ్చిన సెర్చ్ వారెంట్తో అధికారులు ఆ ఆఫీసర్ ఇండ్లల్లో తనిఖీలు చేశారు. ఆరుగురు డీఎస్పీలు, అయిదుగురు ఇన్స్పెక్టర్లు, 9 మంది ఏఎస్ఐలు, ఇతర సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. అన్ని చోట్ల నుంచి సుమారు 1.4 కోట్ల నగదును సీజ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..