అమరావతి, 27 జూలై (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం సింగపూర్లో అడుగుపెట్టగానే ఉత్సాహపూరిత స్వాగతం లభించింది. స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఏపీ ఎన్నార్టీ ప్రతినిధులు సీఎంకు ఘనంగా ఆహ్వానం పలికారు. సాంప్రదాయ తెలుగు వస్త్రధారణలో సింగపూర్ తెలుగు కుటుంబాలు, మహిళలు హోటల్ ప్రాంగణంలో సందడి చేశారు. చిన్నారులు కూచిపూడి నాట్యంతో సీఎంను ఆహ్వానించారు. ఈ ఆహ్వానం ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, ఆతిథ్యానికి అద్దం పట్టింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ