తిరుపతి, 27 జూలై (హి.స.)
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం కన్యాకుమారి-ముంబై ఎక్స్ప్రెస్లోని ఏసీ కోచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే రైలు సిబ్బంది గుర్తించి, నందలూరు రైల్వేస్టేషన్ దగ్గర రైలును నిలివేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో సకాలంలో స్పందించి మంటలను అదుపుచేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. సాంకేతిక లోపంతో మంటలు చెలరేగిట్లు రైల్వే అధికారులు తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి