రాజా సింగ్.. రా అంటే వెంటనే పార్టీలోకి వెళ్లిపోతా! రాజాసింగ్
హైదరాబాద్, 29 జూలై (హి.స.) గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న మొన్నటి దాకా మళ్లీ బీజేపీలో చేరేదే లేదని కుండబద్ధలు కొట్టిన రాజా సింగ్.. ఇప్పుడు మళ్లీ బీజేపీలో చేరేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు. బీజేపీ పెద్దలు పిల
రాజా సింగ్


హైదరాబాద్, 29 జూలై (హి.స.)

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్

మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న మొన్నటి దాకా మళ్లీ బీజేపీలో చేరేదే లేదని కుండబద్ధలు కొట్టిన రాజా సింగ్.. ఇప్పుడు మళ్లీ బీజేపీలో చేరేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు. బీజేపీ పెద్దలు పిలిస్తే మళ్లీ పార్టీలో చేరతానని అన్నారు. వేరే పార్టీలో చేరనని.. తనకు వేరే పార్టీలు సెట్ అవ్వవని చెప్పారు.

మా పెద్దలు పిలిస్తే ఢిల్లీకి వెళ్లి జరిగింది అంతా చెబుతానని రాజా సింగ్ అన్నారు. చాలామంది పార్టీని ఎందుకు విడిచి వెళ్లారు.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు అవమానాలు ఎందుకు భరిస్తున్నారు.. ఇవన్నీ వివరిస్తానని తెలిపారు. ఇవాళ కాకపోతే, రేపు అయినా పిలుస్తారని అనుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక గోషామహల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాదని ఆయన తెలిపారు. తాను పార్టీకి మాత్రమే రాజీనామా చేశానని.. ఎమ్మెల్యే పదవికి కాదని స్పష్టం చేశారు. ఇంకో మూడేళ్ల పాటు తాను ఎమ్మెల్యేగానే ఉంటానని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు కాంగ్రెస్లో చేరారని.. అక్కడ ఉప ఎన్నిక రానిది గోషామహల్లో ఎందుకొస్తుందని ఆయన ప్రశ్నించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande