తెలంగాణ, నల్గొండ. 29 జూలై (హి.స.)వరద ప్రవాహం పెరగడంతో మంగళవారం నాగార్జున సాగర్ గేట్లను ఎత్తారు. మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ చేతుల మీదుగా ఉదయం 11 గంటలకు గేట్లను తెరిచారు. మొత్తం 14 గేట్లను 5 అడుగుల మేర ఓపెన్ చేశారు.
షెడ్యూల్ ప్రకారం నల్లగొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేతుల మీదుగా మంగళవారం ఉదయం 10 గంటలకు నాగార్జున సాగర్ గేట్లను తెరువాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటలకు అందరూ బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్లో నాగార్జునసాగర్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
దాంతో మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ మాత్రమే హెలికాప్టర్లో నాగార్జునసాగర్కు వెళ్లారు. పూజా కార్యక్రమం నిర్వహించి సాగర్ 14 గేట్లను ఎత్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు