ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల గమ్యంగా మార్చే దిశగా సీఎం చంద్రబాబు ప్రణాళికలు
సింగపూర్, 30 జూలై (హి.స.) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సింగపూర్ పర్యటనలో నాలుగో రోజున వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఇండియా), మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్
ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల గమ్యంగా మార్చే దిశగా సీఎం చంద్రబాబు ప్రణాళికలు


సింగపూర్, 30 జూలై (హి.స.) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సింగపూర్ పర్యటనలో నాలుగో రోజున వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఇండియా), మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్, టెమసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో వేర్వేరుగా సీఎం చంద్రబాబు బృందం భేటీ అయ్యారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లు, ఇండస్ట్రీయల్ పార్కులు, డేటా సెంటర్లు, గ్రీన్ బిల్డింగ్స్, డిజిటల్ టౌన్ షిప్స్ వంటి అంశాలపై కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఇండియా) ప్రతినిధులు సంజీవ్ దాస్ గుప్తా, గౌరిశంకర్ నాగభూషణంలతో సీఎం చంద్రబాబు బృందం చర్చించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande