నెల్లూరు30 జూలై (హి.స.)
, వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు మరోసారి నోటీసులు అందాయి. ఆయనకు రెండోసారి నోటీసులు అందించారు కోవూరు పోలీసులు. వచ్చే నెల 4వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న అనుచిత వ్యాఖ్యలు కేసులో అనిల్ కుమార్ యాదవ్ ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో విచారణకు రావాలని పోలీసులు గతంలో నోటీసులు అందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ