హమ్మయ్య..చిరుత చిక్కింది.. మంచిరేవుల ఫారెస్ట్ లో బోనులో చిక్కిన చిరుత
హైదరాబాద్, 31 జూలై (హి.స.) కొన్ని రోజులుగా భయాందోళన సృష్టిస్తున్న చిరుత ఎట్టకేలకు చిక్కడంతో ఫారెస్ట్ అధికారులు బోనులో బంధించారు. గండిపేట మండలం నార్సింగి మున్సిపల్ పరిధిలోని మంచిరేవులలోని వ్యాస్ నగర్ గ్రే హౌండ్స్ లో ఇటీవల కొన్ని రోజుల క్రితం చిరు
చిరుత


హైదరాబాద్, 31 జూలై (హి.స.)

కొన్ని రోజులుగా భయాందోళన సృష్టిస్తున్న చిరుత ఎట్టకేలకు చిక్కడంతో ఫారెస్ట్ అధికారులు బోనులో బంధించారు. గండిపేట మండలం నార్సింగి మున్సిపల్ పరిధిలోని మంచిరేవులలోని వ్యాస్ నగర్ గ్రే హౌండ్స్ లో ఇటీవల కొన్ని రోజుల క్రితం చిరుత కనిపించిన విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం అదే చిరుత గోల్కొండ సమీపంలో రోడ్డు దాటుతూ సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదైన విషయం విధితమే. గత కొద్దిరోజులుగా మృగవని పార్క్, గ్రే హౌండ్స్ ప్రాంతాల్లో చిరుత సంచరించింది. చిరుతను బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు 14 ట్రాప్ కెమెరాలు, అదే విధంగా మూడు బోన్లు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు చిరుత మంచిరేవులలోని ట్రెక్ పార్క్ లో ఉన్నట్లు అంచనాకు వచ్చి పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. బోన్లలో మేక పిల్లలను ఎరగావేశారు. ఈ క్రమంలోనే చిరుతను ట్రెక్ పార్కులోని గేటు వద్ద అధికారులు గురువారం ఉదయం బోనులో బంధించినట్లు చిలుకూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మణ్ వెల్లడించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande