హైదరాబాద్, 4 జూలై (హి.స.)ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ నేడు ఈడీ విచారణకు హాజరయ్యారు. రామకృష్ణ బ్యాంకు కుంభకోణం కేసుకు సంబంధించి అరవింద్ ను శుక్రవారం ఈ డి అధికారులు దాదాపు 3 గంటల పాటు ప్రశ్నించారు.ఈ కేసులో భాగంగా 2018-19 సంవత్సరాల మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీలపై వివరాలు అడిగారు. రామకృష్ణ బ్యాంకులో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి అల్లు అరవింద్కు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో ఈ విచారణ చేశారు. అనంతరం అధికారులు అల్లు అరవింద్కు వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..