ఖమ్మం, 4 జూలై (హి.స.)
: - వరంగల్ హైవేపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరిపెడ శివారు కుడియాతండా వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో లారీ క్యాబిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. రెండు లారీల డ్రైవర్లు, క్లీనర్ మృతి చెందాడు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు.o అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్తో మంటలు ఆర్పివేశారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ