అమరావతి, 4 జూలై (హి.స.)
, గన్నవరం సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో చోరీ జరగడం కలకలం రేపింది. బుధవారం విధులు ముగిసిన అనంతరం ఇక్కడి సిబ్బంది ఎప్పటిలాగే కార్యాలయానికి తాళాలు వేసుకుని వెళ్లగా, గురువారం ఉదయం వచ్చేటప్పటికి కార్యాలయం ప్రధాన ద్వారం గడియ, బయటి గదిలోని బీరువా పగులగొట్టి కనిపించాయి. రూ.వంద విలువైన స్టాంపు పేపర్ల బండిల్తో పాటు సాధారణ స్టాంపులు, ఇతర సామగ్రి చోరీకి గురైనట్లు వారు గుర్తించారు. వేలిముద్రలు పడకుండా వేసుకున్న గ్లోవ్లను నిందితులు అక్కడే పడేసి వెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్ టీం సాయంతో
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ