ఉండవల్లి క్యాంపు కార్యాలయం లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సి ఆర్ డీఏ సమావేశం
అమరావతి, 5 జూలై (హి.స.) అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతికి పరిశ్రమలు రావాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ అన్నారు. 2,500 ఎకరాల్లో స్మార్ట్‌ పరిశ్రమలు తీసుకువస్తామన్నారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో
ఉండవల్లి క్యాంపు కార్యాలయం లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సి ఆర్ డీఏ సమావేశం


అమరావతి, 5 జూలై (హి.స.)

అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతికి పరిశ్రమలు రావాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ అన్నారు. 2,500 ఎకరాల్లో స్మార్ట్‌ పరిశ్రమలు తీసుకువస్తామన్నారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ... 7 గ్రామాల్లో ల్యాండ్‌ పూలింగ్‌ చేస్తామన్నారు. 10 వేల మంది కూర్చునేందుకు కన్వెన్షన్‌ కడితే 2.5 ఎకరాలు ఇస్తామన్నారు. అంతేకాకుండా భాజపా కార్యాలయ నిర్మాణానికి 2 ఎకరాలు కేటాయిస్తామని చెప్పారు. భూముల కేటాయింపుపై కేబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయాలకు ఆమోదం తెలపడం సహా 7 అంశాలపై సీఆర్‌డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande